ముఖేష్‌ అంబానీ స్థానంలోకి వచ్చిన జాక్‌మా

Mukesh ambani and Jack ma
Mukesh ambani and Jack ma

న్యూఢిల్లీ: ఆసియా లో అత్యంత సంపన్నుడి స్థానాన్ని భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబానీ కోల్పోయారు. షేర్‌ మార్కెట్లు కుదేలవడంతో అంబానీ నికర సంపద ఏకంగా 580 కోట్ల డాలర్లు ఆవిరైపోయాయి. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా లీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా నిలిచారు. ముఖేష్‌ అంబానీ కంటే 260 డాలర్లు అధిక సంపద(4450 కోట్ల డాలర్లు)తో ఆసియాలోనే సంపన్నుల్లో నెంబర్‌ వన్‌ గా నిలిచారు. కరోనా వైరస్‌ భయాలు ఈక్విటీ మార్కెట్లను వెంటాడుతున్న క్రమంలో 30 ఏళ్ల కనిష్టస్ధాయిలో ముడిచమురు ధరలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు సోమవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ షేర్లు సైతం ఏకంగా 12 శాతం పతనమయ్యాయి. అయితే ప్రతికూల పరిణామాలు తాత్కాలికమేనని ముఖేష్‌ అంబానీ (62) తిరిగి సత్తా చాటుతారని ఈక్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌కు చెందిన హరీష్‌ హెచ్‌వీ అన్నారు. అంబానీ టెలికాం బిజినెస్‌ రానున్న సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకొచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/