జగన్ కు జై కొట్టిన జబర్దస్త్ అప్పారావు..

ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పలు యాత్రల పేరిట ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతును తమకు నచ్చిన నేతలకు తెలియపరుస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ అప్పారావు వైస్సార్సీపీ పార్టీకి తన మద్దతును తెలియజేసారు.

వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులకు అప్పారావు మద్దతు తెలిపారు. ఈ నెల 15న విశాఖ గర్జన కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలియజేసారు. విశాఖపట్నం కళాకారుడిగా ‘మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ గర్జన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ గర్జనను విజయవంతంగా జరగాలని.. ‘మన విశాఖను రాజధానిగా మార్చే ప్రక్రియలో అందరం మద్దతు ఇవ్వాలని’ పిలుపునిచ్చారు. వైజాగ్ ను రాజధాని చేయాలని కోరుతున్నానని.. ఈ మహా యజ్ఞంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా 15న విశాఖకు వస్తున్నాను.. అందరూ రాజధానికి మద్దతు ఇవ్వాలని ‘మన విశాఖ-మన రాజధానికి నా మద్దతు ఉంటుంది’ అన్నారు.