మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లలో ఐటీ దాడులు

ఈ మధ్య ఐటీ , సీబీఐ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి. సినీ , రాజకీయ , బిజినెస్ నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ‘శ్రీమంతుడు’ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్.. మొదటి మూవీ తోనే సూపర్ హిట్ కొట్టి భారీ లాభాలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్, నాగచైతన్య, రవితేజ, అల్లు అర్జున్’ వంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించింది.

ప్రస్తుతం చిరంజీవి తో ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ తో ‘ వీర సింహా రెడ్డి’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు చిత్రాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ కొత్త సినిమా చేయబోతున్నారు. దీనికి సంబదించిన పూజా కార్య క్రమాలు ఆదివారం జరిగాయి. ఇదిలా ఉంటె ఈ రోజు ఉదయం నుంచి సంస్థకు చెందిన ఆఫీసులతో పాటు ఇళ్లల్లో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ దాడులతో చిత్రసీమ ఒక్కసారిగా షాక్ లో పడింది.