మల్లారెడ్డి వద్ద రూ.15 కోట్లతో పాటు బంగారాన్ని సీజ్ చేసిన ఐటీ అధికారులు

రెండు రోజుల పాటు ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై , ఆఫీస్ లపై సోదాలు చేసి దాదాపు రూ. 15 కోట్ల తో పాటు పెద్ద ఎత్తున బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో విద్యార్ధుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలను తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డికి చెందిన అన్ని రకాల కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూల్ చేసినట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు.

ఇక సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి అధికారులు నోటీసులిచ్చారు. సోమ, మంగళవారాల్లో (28,29 తేదీల్లో) విచారణను రావాలని నోటీసులు జారీ చేసారు. మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడుతో పాటు సన్నిహితులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై వీరందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు.