వ్యాపారి ఇంట్లో పట్టుబడ్డ నోట్ల కట్టలు ..లెక్కించడానికే 13 గంటల సమయం

పట్టుబడ్డ రూ. 58 కోట్ల నోట్ల కట్టలు, 32 కిలోల బంగారం

it-seizes-rs-56-cr-cash-rs-14-cr-worth-jewellery-during-raids-in-maharashtra

ముంబయిః మహారాష్ట్రకు చెందిన ఉక్కు, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారికి చెందిన నివాసాల్లో దాడులు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో ఈదాడులు చేశారు. . లెక్కల్లో చూపని రూ. 58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్ చేశారు. అలాగే రూ.390 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.

ఆదాయపు పన్ను శాఖ నాసిక్ విభాగం ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జల్నా, ఔరంగాబాద్ నగరాల్లోని సదరు వ్యాపారి కార్యాలయాలు, నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ డిపార్ట్‌మెంట్ కు 13 గంటల సమయం పట్టింది. మొత్తం 260 మంది అధికారులు, ఉద్యోగులు ఐదు బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/