మరోసారి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
గాజా : ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది. దక్షిణ ఇజ్రాయెల్లోకి పాలస్తీనియన్లు పేలుడు బెలూన్లు వదిలారని ఆరోపించింది. ఈ మేరకు వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. హమాస్ కాంపౌండ్లో దాడి చేశామని, రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. గాజా నగరం, సిటీ ఆఫ్ ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్ మీడియా సంస్థ పేర్కొంది.
కాగా, పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజుల కాక ముందే ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/