వరుస విజయాల్లో గోవా ఎఫ్సి
ఐఎస్ఎల్ సీజన్ 100వ మ్యాచ్లో ఘన విజయం
పనాజి: గోవా ఫుట్బాల్ టీం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆరో సీజన్లో భాగంగా గోవాలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నార్త్ ఈస్ట్ యునైటెడ్తో జరిగిన మ్యాచ్లో గోవా 2-0 తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ లీగ్లో భాగంగా గోవా ఎఫ్సి ఆడిన 100వ మ్యాచ్లో విజయ సాధించింది. ఫలితంగా ఇండియన్ సూపర్ లీగ్లో వంద మ్యాచ్లు ఆడిన జట్టుగా గోవా నిలిచింది. అంతేకాకుండా సొంత మైదానంలో గోవాకు ఇది 50 వ మ్యాచ్ కావడం కూడా విశేషం. ఈ లీగ్లో 100 గోల్స్ చేసిన జట్టుగా కూడా గోవా ఎఫ్సి అరుదైన రికార్డును దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గోవా ఎఫ్సి 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కోల్కతాకు చెందిన ఏటికే 21 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో ఐఎస్ఎల్ అరంగేట్రం చేసిన హైదరాబాద్ ఎఫ్సి ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడగా… కేవలం ఒక్క మ్యాచ్లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/