20నుంచి ఐఎస్ఎల్ షురూ
టోర్నీ షెడ్యూల్ విడుదల
పనాజి : ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ నవంబర్ 20న కేరళ బ్లాస్టర్స్-ఎటికె మోహన్బగాన్ జట్ల మధ్య పోరుతో ఆరంభం కానున్నది.
ఈ మేరకు నిర్వాహకులు టోర్నీ షెడ్యూల్ను విడుదల చేశారు. గోవాలోని మూడు స్టేడియంలలో ఈ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు.
ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లను నిర్వహిస్తారు. ఆదివారం జరిగే రెండు మ్యాచ్లను సాయంత్రం 5గం., రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తారు.
ఈ ఏడాది కోల్కతాకు చెందిన మేటి జట్లు మోహన్బగాన్, ఈస్ట్బెంగాల్ కూడా లీగ్లో పాల్గొననున్నాయి. లీగ్ పోటీలు నవంబర్నుంచి ఫిబ్రవరివరకు జరుగనున్నాయి.
సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీల తేదీలను తరువాత ప్రకటిస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/