రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ హీరోయిన్ ..శోకసంద్రంలో ఇండస్ట్రీ

చిత్రసీమలో వరుస మరణాలు చిత్రసీమను శోకసంద్రంలో పడేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక ఇండస్ట్రీ లో ఎవరో ఒకరు పలు కారణాలతో తనువు చాలిస్తున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటి ఈశ్వరి దేశ్ పాండే (25) మృతి చెందింది. తనకు కాబోయే భర్త అయిన శుభమ్ డెడ్జ్ తో కలసి హాలిడే ట్రిప్ కోసం గోవా వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా-కలాంగుట్‌ బ్రిడ్జిపై అదుపు తప్పి పక్కన నీటి కుంటలోకి పడిపోయింది.

కారులో ఉన్న వీరిద్దరూ బయట పడలేక ప్రాణాలు కోల్పోయారు. హిందీ, మరాఠీ సినిమాలు చేస్తున్న ఈశ్వరి(25) తన స్నేహితుడైన శుభమ్ డెడ్జ్ (28)ను ప్రేమించి పెళ్లాడబోతోంది. చాన్నాళ్లుగా వీరి మధ్య పరిచయం స్నేహంగా.. ప్రేమగా మారింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వచ్చే నెలలోనే నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరు మరణించడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా వెళ్లిన వారు సంతోషంగా తిరిగి వస్తారనుకుంటే శవాలై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.