నేడు , రేపు ఐపీల్ 2022 ఆటగాళ్ల వేలం

ధోనీ ఎవరెవరిని ఎంపిక చేస్తాడని సర్వత్రా ఉత్కంఠ

IPL 2022 auction
IPL 2022 auction

ఐపీల్ 2022 కు సంబంధించి ఇవాళ , రేపు జరగ నున్న వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని ఐపీల్ 2022 వేలంలో ఎవరెవరిని కొనుగోలు చేస్తాడో అని ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కసి విశ్వనాథన్ మాట్లాడారు. అభిమానులను ధోనీ నిరాశ పరచడని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా , ఈసారి ధోనీ పాత ఆటగాళ్లను కొనుగోలు చేస్తాడని సమాచారం. ప్రధానంగా డుప్లెసిస్ , అంబటి రాయుడు, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ , హేజిల్ వుడ్ , బ్రావో ఉన్నట్టు తెలిసింది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ రూ . 48 కోట్లతో బరిలోకి రానుంది. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ . 72 కోట్లతో బరిలోకి వస్తోంది . ఢిల్లీ క్యాపిటల్స్ రూ . 47. కోట్లతో, కోల్ కతా నైట్ రైడర్స్ రూ . 48 కోట్లతో వేలం లోకి రానున్నాయి. గుజరాత్ టైటాన్స్ రూ . 52 కోట్లతో, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు రూ . 57 కోట్లతో, లక్నో సూపర్ జెయింట్ రూ . 59 కోట్లతో, రాజస్థాన్ రాయల్స్ రూ . 62 కోట్లతో, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ . 68 కోట్లతో పోరుకు దిగబోతున్నాయి.

అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/