హైదరాబాద్లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్ల ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్మగ్లర్ల ముఠా నుంచి రూ.9 లక్షల విలువైన 38 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/