అంతర్జాతీయ విమానాల నిలిపివేత
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ
New Delhi: కరోనాపై పోరులో భాగంగా ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.
ప్రధాని జనతా కర్ఫ్యూకు ఇచ్చిన పిలుపునకు జనం స్వచ్ఛందంగా ఇళ్లకు పరిమితమయ్యారు. అలాగే కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ రోజు నుంచి 29వ తేదీ వరకూ అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు.
విదేశాల నుంచి వచ్చే విమానాలకు దేశంలోని విమానాశ్రయాల్లో ల్యాండింగ్ కు అనుమతించేది లేదని ఢీజీసీఎ ప్రకటించింది.
ఇక అంధ్రప్రదేశ్ లో కూడా జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా జరుగుతోంది. ప్రభుత్వం ఈ రోజు డ్రై డేగా ప్రకటించింది.
అలాగే 31వ తేదీ వరకూ వాణిజ్య సముదాయాలన్నీ మూసివేయాలని ఆదేశించింది.
తాజా క్రీడా వార్తల కోసం https://www.vaartha.com/news/sports/