ప్రశాంతత కరవైన జీవిత చరమాంకం!

నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

International Day for Older Persons
International Day for Older Persons

ప్రస్తుత నవతరంలో మార్పురావాలి. బంధాలకు విలువనివ్వాలి. పసిప్రాయంలోనే చదువుల పేరుతో పిల్లలను దూరప్రాంతాలకు పంపించడం వలన ప్రేమాభిమానాలకు దూరమైన పిల్లలు, పెద్దవారై విలువలను త్యజించి ఉన్మాదులుగా తయారవుతున్నారు.

ఈ విషయాన్ని పెద్దలు గమనించి కనీసం 15 సంవత్సరాల వయసొచ్చేవరకు తమ వద్దే ఉంచి విద్యాబుద్ధులు నేర్పాలి.

ఉపాధ్యాయులు కూడా బాలలపట్ల కొద్దిపాటి శ్రద్ధ వహించి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. నైతిక ప్రవర్తన పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అప్పుడే బాలలు మానసికంగా వికసించి, పెరిగి పెద్దవారైన తర్వాత వారిలో తల్లిదండ్రులను గౌరవించే ఉన్నతమైన సంస్కారం అలవడుతుంది. అప్పుడే వృద్ధాశ్రమాలు లేని సమాజం నెలకొంటుంది.

వా ర్ధక్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చోటుచేసుకునే సహజ ప్రక్రియ. ఎలాంటి బాధలు,కష్టాలు కన్నీళ్లు లేకుండా వృద్ధాప్యాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా ఆస్వాదించాలి.

జీవితంలో ఎన్నోకష్టాలను అనుభవించి వయో భారం ముంచుకొస్తున్న తరుణంలో ఇంకా వారిని బాధలకు గురి చేసి,ఆప్యాయతలను చెరిపేసి, వృద్ధాప్యంలో అనాథలుగా వదిలేయడమో, అనాథాశ్రమాలకు గెంటేయడమో జరుగుతున్నది.

ఇంతకంటే అమానుషత్వం మరొకటుండదు. వైద్య, ఆరోగ్య సదుపాయాలు పెరిగిన నేపథ్యంలో వయోవృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఐక్యరాజ్యసమితి అంచనాప్రకారం భారతదేశంలో 60సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య 2050 నాటికి 20 శాతం పెరగవచ్చునని తెలియవస్తున్నది.

80సంవత్సరాలు దాటిన వృద్ధుల ఆరోగ్య సమస్యల విషయంలో మరింతజాగ్రత్త వహించా ల్సిఉంటుంది. 1990 డిసెంబరు 14వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ప్రతి సంవత్సరం అక్టోబరు 1వ తేదీన అంత ర్జాతీయ వృద్ధుల దినోత్సవం జరపాలని నిర్ణయించింది.

వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడి, జీవిత చరమాంకంలో వారిని ప్రశాంతంగా ఉండేటట్లు చూడడమే వృద్ధుల దినోత్సవం ప్రధానలక్ష్యం. మాన వ్ఞడు సర్వ జీవరాశుల్లో అత్యంత శక్తివంతుడు.

యుక్తిలో, మేథా శక్తిలో మానవ్ఞడికి మానవుడేసాటి.

మానవ జీవపరిణామ క్రమం ఎంత విచిత్రంగా ఉన్నా, ఎన్ని మజిలీలు దాటి,ఆధునిక, మానవు నిగా అవతరించినా మనిషిలోని మేథస్సు వక్రమార్గంలో పయ నించడం వలస రాతియుగపు మానవుడు పునరావిర్భావం చెంది నట్టుగా అనిపించడంలో అతిశయోక్తిలేదు.

ముఖ్యంగా పాశ్చాత్య నాగరికత ఒక విప్లవంగా సమాజంలో దూసుకు వచ్చినతర్వాత మానవ్ఞల మధ్యసంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి.

మనిషికి మనిషికి మధ్య పొసగడం లేదు.మానవత్వం మసకబారిపోయిం ది. ఉమ్మడి కుటుంబాలు కలహాలకు నిలయాలుగా మారాయి. స్వేచ్ఛ పేరుతో ఉమ్మడి కుటుంబాలు వేరుబడి, న్యూక్లియర్‌ కుటుంబాలుగా పరివర్తన చెందాయి. స్వార్థ మనే అనారోగ్యం సోకి, సంకుచిత మనస్తత్వాలతో ఎవరికివారే యమునాతీరే అనే రీతిలో తయారై చివరికి జన్మప్రదాతలైన తల్లిదండ్రులను సైతం విస్మరిస్తున్న వైనం అనాగరికతను సూచిస్తున్నది.

పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టకతప్పదు. ప్రతి ఒక్కరూ బాల్యం, యవ్వనం, కౌమారం అనే దశలను దాటి వృద్ధాప్యం అనేచివరి దశను స్పృశించక తప్పదు. వృద్ధాప్యం ఒక శాపం కారాదు. దురదృష్టవశాత్తు నేటి వ్యవస్థలో వృద్ధులకు లభిస్తున్న గౌరవం శూన్యం.

తమ ఇంట పనిమనుషులకు ఇచ్చే గౌరవం కూడా తల్లిదండ్రులకు లభించడంలేదు. శరీరం సహకరించక పోయినా,బండెడు చాకిరీ చేస్తున్నా, ఇసుమంత ప్రేమాభిమానా లకు సైతం కరవై, బతుకే బరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్న పెద్దలను మనం ఎంతో మందిని చూస్తున్నాం.

కనిపెంచిన పిల్లలు కఠినహృదయులై పెద్దలను బయటకు గెంటుతున్నారు.

పెంపుడు కుక్కలకు పరమాన్నాలు,పట్టుపరుపు పవళింపు సేవలు,కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పించి, బతుకుదెరువ్ఞ కల్పించి, కోట్లాది రూపాయల స్థిరచరాస్తులను అనుభవించమని అప్పగించిన తల్లిదండ్రుల స్థానం మాత్రం ఇంటిబయటే.

అందరూ ఉండి కూడా అనాథలుగా రహదారుల వెంట బిచ్చమెత్తుకుంటూ దినాతీదీనంగా బతుకీడుస్తున్న అభాగ్యులైన వృద్ధులను చూసి మానవత్వం తలదించుకుంటున్నది.

కొందరైతే కనిపెంచిన వారిని సైతం తమ తల్లిదండ్రులుగా చెప్పుకోవడానికే సిగ్గుపడు తున్నారు.నామోషీగా భావిస్తున్నారు.

విద్యావంతులోనే ఇలాంటి ధోరణి అధికంగా ఉంది. చదువులు నేర్పించిన సంస్కారం ఇదేనేమో!

ఉద్యోగాల పేరుతో భార్యాభర్తలు ఆఫీసుల్లో, చదువుల పేరుతో పిల్లలేమో మనసులేని, వికాసం లేని మరమనుషులుగా తయారు చేసే కర్మాగారాల్లాంటి విద్యాలయాల్లో జీవితమంతా కష్టాలను అనుభవించి జీవిత చరమాంకంలోనైనా ప్రశాంతంగా తమ బిడ్డల వద్ద సేద తీరవలసిన వృద్ధులైన తల్లి దండ్రులేమో వృద్ధాశ్రమాల్లో ఇదీ నడుస్తున్న చరిత్ర.

ఒకరికొకరికి సంబంధం లేని వింతజీవితాల్లో సంబంధాల గురించి ఇంతకంటే గొప్పగా వర్ణించలేం. అనాథమైన వృద్ధులు వృద్ధాశ్రమాలను ఆశ్ర యించడంలో తప్పులేదు. అందరూ ఉండి అనాథలుగా బతుకీడ్చ వలసిన ఆగత్యం పట్టడం దురదృష్టకరం.

ఇదే ఆధునిక మానవ పరిణామప్రక్రియ. జీవిత సర్వస్వం ధారబోసి, ఆస్తులిచ్చిన తల్లి దండ్రులకు అవసానదశలో తమ సంతానమిచ్చిన విలువైన బహు మానం ఇదేనా?

తాముపడ్డ కష్టాలు తమ బిడ్డలు పడరాదని, జీవిత సర్వస్వం ధారబోసి, రేయింబవళ్లు కష్టించి తమ స్వేదాన్ని సంపదగా మార్చి తమ సంతానానికి అందిస్తే అవన్నీమరిచిపోయి వృద్ధాప్యభారంతో అల్లాడుతున్న తల్లిదండ్రుల ఆలనాపాలనా మరచి, ఈసడింపులతో విసిరేయడం సంస్కారమా?

పెద్దలను విస్మరించి, వారి బాగోగులను గాలికి వదిలేసిన ప్రబుద్ధులు పొర్లు దండాలు పెడుతూ నిరంతర దైవార్చనలో మునిగితేలితే దైవం హర్షిస్తుందా? ప్రస్తుత నవతరంలో మార్పురావాలి.

బంధాలకు విలువనివ్వాలి. పసిప్రాయంలోనే చదువ్ఞల పేరుతో పిల్లలను దూరప్రాంతాలకు పంపించడం వలన ప్రేమాభిమానాలకు దూరమైన పిల్లలు, పెద్దవారై విలువలను త్యజించి ఉన్మాదులుగా తయారవుతున్నారు.

ఈ విషయాన్ని పెద్దలు గమనించి కనీసం 15 సంవత్సరాల వయసొచ్చేవరకు తమ వద్దే ఉంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఉపాధ్యాయులు కూడా బాలలపట్ల కొద్దిపాటి శ్రద్ధ వహించి పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి.

నైతిక ప్రవర్తన పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే బాలలు మానసికంగా వికసించి, పెరిగి పెద్దవారైన తర్వాత వారిలో తల్లిదండ్రులను గౌరవించే ఉన్నతమైన సంస్కారం అలవడుతుంది. అప్పుడే వృద్ధాశ్రమాలు లేని సమాజం నెలకొంటుంది. ఆ రోజు కోసం ప్రయత్నిద్దాం.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/