శిల్పకళావేదిక స్టేజ్ పై నుంచి పడి ఐబీ అధికారి మృతి

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీపై నుంచి జారిపడి ఇంటెలిజెన్స్‌ బ్యూరో అడిషనల్‌ డైరెక్టర్‌ మృతి చెందాడు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీఎస్పీగా పని చేస్తున్న కుమార్ అమ్మిరేష్.. శిల్పకళావేదికలో దివంగత సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు అమ్మిరేష్ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన స్టేజ్ పై నిలుచుని ఫొటోలు తీస్తుండగా… పొరపాటున స్టేజ్ ముందు ఉన్న గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమ్మిరేష్ ను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయం కావడంతో… చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బదిలీపై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వచ్చిన కుమార్‌ అమరేష్‌కు కొద్ది నెలల క్రితమే డిప్యూటీ డైరెక్టర్‌ నుంచి అడిషనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.