మళ్లీ ఆగిపోయిన వాట్సాప్ , ఫేస్ బుక్ సేవలు
వాట్సాప్ , పేస్ బుక్ సేవలు మళ్లీ నిలిచిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు రెండు గంటల పాటు సేవలు ఆగిపోయాయి. దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారంలో రెండో సారి సేవలు ఆగిపోవడం తో అసలు ఏంజరుగుతుందనే ఆలోచన అందరిలో కలుగుతుంది. ఈ సేవలు ఆగిపోవడంతో ఇన్స్టాగ్రామ్ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెప్పింది.
సోమవారం రాత్రి 9 గంటల తర్వాత.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సేవలకు అంతరాయం కలిగినందువల్ల.. కొన్ని గంటల పాటు వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దాదాపు 7 గంటల తర్వాత వాట్సాప్ సేవలు పునరుద్ధరించారు. ఇండియాలో ఫేస్బుక్కు 410 మిలియన్(41 కోట్లు) యూజర్లు ఉన్నారు. ఇక వాట్సాప్కు దేశవ్యాప్తంగా 530 మిలియన్ (53 కోట్లు) యూజర్లు ఉన్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్కు ఇండియాలో యూజర్ల సంఖ్య 210 మిలియన్లు (21 కోట్లు)గా ఉంది.