భారీ వర్షం..నేటి మ్యాచ్ రద్దు

మ్యాచ్ ని రద్దు చేసిన అంపైర్లు

indvsnz
indvsnz

వెల్లింగ్టన్‌: వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో 100 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను వరుణుడు ఆదుకున్నాడు. టీ విరామ సమయంలో భారీ వర్షం పడటం, వర్షం తగ్గే సూచనలు కనిపించక పోవడంతో, ఈ రోజుకు మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో 55 ఓవర్ల వద్ద 122 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో మ్యాచ్ నిలిచింది. రేపు వాతావరణం అనుకూలిస్తే, మ్యాచ్ ని మరింత సమయం పాటు కొనసాగిస్తామని ఈ సందర్భంగా అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం అజింక్యా రహానే 38 పరుగులతో, రిషబ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/