భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చింది..కాని

భారత్ లో జూలైలో గరిష్ఠ స్థాయికి కరోనా కేసులు నమోదవుతాయి..ప్రపంచ ఆరోగ్య సంస్థ

David Nabarro

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల విషయంలో భారత్‌ చాలా వేగంగా స్పందించడం వల్లనే కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేయగలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్లూహెచ్‌ఓ) రాయబారి డేవిడ్‌ నబారో స్పష్టం చేశారు. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అంతకు ముందు కొన్ని రోజుల పాటు కేసుల నమోదు స్థిరంగా ఉంటుందని చెప్పారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు. కాగా భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/