పాక్ పై భారత్ మహిళా జట్టువిజయం
ప్రపంచ కప్ తొలిమ్యాచ్
ప్రపంచకప్ ఫస్ట్ మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్థాన్పై 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ కేవలం 43 ఓవర్లలో 137 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత్ తరఫున రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీసుకుంది. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. స్నేహ రాణా, పూజా వస్త్రాకర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. పూజ 59 బంతుల్లో 67 పరుగులు చేసింది. అదే సమయంలో స్నేహ బ్యాటింగ్లో 53 పరుగులు వచ్చాయి. స్మృతి మంధాన కూడా 52 పరుగులు చేసింది.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/