అరేబియా సముద్రంలో కులిపోయిన మిగ్‌ శిక్షణ విమానం

ఇద్దరు పైలెట్లతో వెళ్లిన మిగ్..సెర్చ్ ఆపరేషన్ మొదలు

mig-29k-crashed-in-arebian-sea

న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం నిన్న సాయంత్రం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిపోయింది. ఈ మేరకు నేవీ అధికారులు విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని, రెండో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు.
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/