విజ‌య‌వంతంగా అత్యాధునిక బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష : భార‌త నౌకాద‌ళం

న్యూఢిల్లీ: భార‌త నౌకాద‌ళం అడ్వాన్స్‌డ్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించింది.ఈ ప‌రీక్ష స‌మ‌యంలో, క్షిప‌ణి ఖ‌చ్చిత‌మైన ల‌క్ష్యాన్ని చేధించింది. ఇది బ్రహ్మోస్ క్షిపణికి ఆధునిక వెర్షన్ అని చెప్పాలి. అందులో పలు అప్‌డేట్‌లు వచ్చాయి. నవీకరణ తర్వాత, దాని ఫైర్‌పవర్ మరింత పెరిగింది. భారతదేశం యొక్క ఈ విజయవంతమైన పరీక్ష స్వావలంబన భారత మిషన్ విజయానికి ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. సముద్రం నుంచి దూరంగా భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాన్ని ఈ పరీక్షల ద్వారా తెలుసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

బ్రహ్మోస్ క్షిపణితోపాటు దీనిని పరీక్షించిన ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక, రెండూ కూడా దేశీయంగా నిర్మించినవేనని భారత నౌకాదళం తెలిపింది. భారతీయ క్షిపణి అభివృద్ధి, నౌకా నిర్మాణ సామర్థ్యానికి ఇవి ప్రతీకలనిపేర్కొంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలు, సహకారాలను ఇలాంటివి మరింత బలోపేతం చేస్తాయని వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/