భారత్-కివీస్ మధ్య మూడో టీ20 నేడే!
హామిల్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 20 ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా హామిల్టన్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్ను గెలిచి తొలిసారి కివీస్ గడ్డపై సిరీస్ దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ భావిస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 12.30కి ప్రారంభం కానుంది. కాగా, టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ భీకర ఫామ్లో ఉన్నాడు. బౌలర్లు కూడా చక్కగా రాణిస్తున్నారు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్తో పాటు సిరీస్పై కన్నేశాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/