టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

INDIA vs NEW ZEALAND 3rd T20
INDIA vs NEW ZEALAND 3rd T20

హామిల్టన్‌: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు హామిల్టన్‌ వేదికగా కివీస్‌తో కోహ్లీసేన మూడో మ్యాచ్‌లో తలపడనుంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో ఇటీవల జరిగిన రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతోన్న నేటి మ్యాచ్‌ కూడా గెలిస్తే కప్ సొంతమవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియాలో ఎటువంటి మార్పులు లేవు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, దుబే, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఛాహల్, షమీ, బుమ్రా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కనీసం మూడో మ్యాచ్‌లోనైనా గెలవాలన్న కసితో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ ఆడుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/