235 పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌

టీమిండియాకు స్వల్ప ఆధిక్యం

India vs New Zealand test match
India vs New Zealand test match

క్రైస్ట్‌చర్చ్‌: భారత్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కివీస్‌ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక్కడి పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తూ ఉండటంతో, చెలరేగిన భారత బౌలర్లు రెండో రోజు మొత్తం 10 వికెట్లనూ పడగొట్టారు. షమీకి నాలుగు, బుమ్రాకు మూడు వికెట్లు లభించగా, జడేజా రెండు, ఉమేశ్ యాదవ్ లకు ఒక వికెట్ లభించాయి. దీంతో ఇండియాకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మరికాసేపట్లో ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుండగా, న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్, జెమీసన్, వాగ్నర్ ల నుంచి వచ్చే నిప్పులు చెరిగే బంతులను టాప్ ఆర్డర్ ఎలా ఎదుర్కొంటుందన్న అంశంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/