టీమిండియా చేజారిన వన్డే సిరీస్
రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్కు గట్టి దెబ్బే తగిలింది. టీమిండియాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 251 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ పై 22 పరుగుల తేడాతో కివీస్ గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ ను కివీస్ 20తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్స్ లో శ్రేయస్ అయ్యర్(52), రవీంద్ర జడేజా(55), నవదీప్ సైనీ(45)లు మాత్రమే రాణించగా.. ఓపెనర్లతోపాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ(15), కెఎల్ రాహుల్(4)లు ఘోరంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్, గ్రాండ్ హోమ్, బెన్నెత్ లు తలో వికెట్ పడగొట్టగా, నీషమ్ ఒక వికెట్ తీశాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/