భారత్‌లో 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,36,657

india-corona virus-cases

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 9,887 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది. 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకున్నారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/