దేశంలో 24 గంటలో అత్యధికంగా 2,293 కేసులు

24 గంటల్లో 71 మంది మృతి..కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218

corona-india
corona-india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటలో దేశంలో ఇప్పటివరకు ఏరోజు కూడా నమోదు కానన్ని కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,293 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,218కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 37,336కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 9,950 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 26,167 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/