పాజిటివ్ కేసుల్లో ఇండియా 4వ స్థానం
రోజుకు సగటున 6 వేలకు పైగా కేసులు
New Delhi: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
నమోదైన కేసుల్లో ఇండియా టాప్ టెన్ కి చేరింది. దేశంలో రోజూ సగటున6 వేలకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్ధితి మరింత ప్రమాదకరంగా మారింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది.
తొలివిడత లాక్డౌన్ వేళ కరోనా వ్యాప్తి పూర్తి నియంత్రణలో ఉండగా, నాలుగో విడత లాక్డౌన్ సడలింపులు అమలవుతున్న ప్రస్తుత సమయంలో వైరస్ వ్యాప్తి అతి తీవ్రంగా మారింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/