ఒక్క రోజులో 10 లక్షల మందికి పైగా వ్యాక్సిన్

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా భారత్ మరో మైలురాయిని అందుకుంది. ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా టీకాను వేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. నిన్న రాత్రి 7 గంటల వరకూ 10.93 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించామని, జనవరి 16న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన తరువాత, ఒకరోజులో ఇంతమందికి టీకాను అందించడం ఇదే తొలిసారని పేర్కొంది.

ప్రస్తుతం ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో టీకా సాధారణ పౌరులకూ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇండియాలో నమోదవుతున్న తాజా కేసుల్లో 85.51 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తాజా ఏపీ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/