భారత్‌ తిరిగి నవ్వుతుంది.. మోదీ

ప్రస్తుత కాలంలో ప్రజలు సహకరిస్తే ఇది సాధ్యం

narendra modi
narendra modi

దిల్లీ: ప్రధాని మోది చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. అదేమిటంటే.. భారత్‌ తిరిగి నవ్వుతుంది, భారత్‌ మరోసారి విజయం సాధిస్తుంది. ఇండియా పోరాడుతుంది. గెలిచి తీరుతుంది. అంటూ ఈ ఉదయం ప్రధాని పెట్టిన ఓ ట్వీట్‌ ఇపుడు వైరల్‌గా మారింది. కాగా ప్రధాని ఈ ట్వీట్‌తో పాటు ఓ పాటను కూడా పోస్ట్‌ చేశాడు. ముస్కురాయేగా ఇండియా పేరిట విడుదలయిన ఈ సాంగ్‌ను ప్రధాని పోస్ట్‌చేశారు. ఈ వీడియో కరోనా వైరస్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచుతుందని అన్నారు. ప్రస్తుత సమయంలో ప్రజలు సహకరిస్తే, భారతావని మరోమారు నవ్వుతుందన్న సందేశం ఇందులో ఉందని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/