కరోనా కేసులు మూడో స్థానంలో భారత్‌

రష్యాను వెన‌క్కునెట్టిన ఇండియా

Coronavirus in India
Coronavirus in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. కేసులు విషయంలో భారత్‌ రష్యాను అధిగమించి, టాప్3 స్థానంలోకి చేరుకుంది. నిన్న సాయంత్రానికి దేశంలో అధికారికంగా 6.9 లక్షల కేసులు రాగా, రష్యాలో నమోదైన 6.8 లక్షల కేసులను ఇండియా దాటేసింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు 28 లక్షలకు పైగా కేసులతో అమెరికా, 15 లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ ఉన్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తరువాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/