స్మార్ట్ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్
న్యూఢిల్లీ: ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్ రాకెట్లా దూసుకుపోతోంది. మిగతా రంగాల్లో అమ్మకాలు డల్గా ఉన్నప్పటికీ ఫోన్లకు మాత్రం డిమాండ్ కొంచెం కూడా తగ్గడం లేదు. వీటి మార్కెట్ ఎంతలా పెరుగుతున్నది అంటే, స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో ఇండియా అమెరికాను మించిపోయింది!! గత ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ 15.8 కోట్ల షిప్మెంట్లను రికార్డు చేసిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ స్టడీ తెలిపింది. 2018తో పోలిస్తే గత ఏడాది షిప్మెంట్ల సంఖ్య ఏడుశాతం పెరిగింది. ఇప్పటికీ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ కాగా, ఇండియా, అమెరికాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. చైనా కంపెనీలు ఫ్లాగ్ షిప్ గ్రేడ్ ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలోనే ఇస్తుండటంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఇది విశ్లేషించింది. సాధారణ ఫోన్ వాడేవాళ్లు ఇలాంటి మిడ్ రేంజ్ ఫోన్లు కొంటుండంతో షిప్మెంట్లు ఎక్కువయ్యాయని తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/