భారత్‌లో 24 గంటల్లో 8,171 కేసులు

24 గంటల్లో 204 మంది మృతి..మొత్తం కేసులు 1,98,706

India corona cases

న్యూఢిల్లీ: భారత్‌తో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 8,171 మందికి కొత్తగా కరోనా సోకగా, 204 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/