భారత్‌లో 67 లక్షలు దాటిన కోవిడ్‌ కేసులు

నిన్న కొత్తగా 72,049 కేసులు నమోదు..మొత్తం మృతుల సంఖ్య 1,04,555

India – corona cases

న్యూఢిల్లీ: భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 67 లక్షల మార్కును చేరుకుంది. ఇక నిన్న ఒక్క రోజులో ఏకంగా 72,049 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 67,57,132కు చేరుకుంది. వీటిలో 9,07,883 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 57,44,694 మంది కోలుకోగా నిన్న 986 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటి వరకు 1,04,555 మరణాలు సంభవించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/