భారత్‌లో 24 గంటల్లో 26,506 కొత్త కేసులు

మృతుల సంఖ్య మొత్తం 21,604

corona virus- india

న్యూఢిలీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,93,802కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 21,604కి పెరిగింది. 2,76,685 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,95,513 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈరోజ ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/