ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు రంగం సిద్ధం

కొనుగోలు సంస్థలు ఆస్తులతో పాటు అప్పులు స్వీకరించాలని నిబంధన

Airindia
Airindia

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో కొనసాగుతోన్న ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వందశాతం ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు ప్రకటిస్తూ.. ఆసక్తి కలవారు ముందుకు రావచ్చని అధికార ప్రకటన విడుదల చేసింది. ఇందుకు మార్చి 17లోగా ప్రాథమిక ఆసక్తి వ్యక్తీకరణ చేయాలని సూచించింది. అయితే.. కొనుగోలుదారులు సంస్థ ఆస్తులతో పాటు ఎయిర్ ఇండియాకు చెందిన 3.26 బిలియన్ డాలర్ల రుణాలను కూడా స్వీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. దేశ,విదేశాలకు విమానయాన సేవలను అందిస్తున్న ఎయిర్ ఇండియా 20వేలకు పైగా ఉద్యోగులను కలిగివుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో సంస్థ 18.6 శాతం వాటాను కలిగిన సంస్థ 2018లో తన వాటాల్లో మెజారిటీ వాటాలను సింగిల్ బిడ్లో అమ్మడానికి ప్రయత్నం చేసి విఫలమైంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/