భారత్‌లో 24 గంటల్లో 9,851 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసులు 2,26,770..మృతుల సంఖ్య 6,348

India – corona cases

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 9,851 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 273 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,26,770 కి చేరగా, మృతుల సంఖ్య 6348 కి చేరుకుంది. 1,10,960 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకున్నారు. ఈమేరకు ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ వివరాలను వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/