ఆట ముగిసే సమయానికి భారత్ 96/2
క్రీజ్ లో ఛటేశ్వర్ పుజారా, రహానే
Sydney: బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
ఛటేశ్వర్ పుజారా, రహానే క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోరు 166/2 ’ఈ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా స్మిత్ సెంచరీ పుణ్యామా అని గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది.
భారత బౌలర్లలో జడేజా నాలుగు, అశ్విన్, బుమ్రా రెండో సి వికెట్లు పడగొట్టగా, సిరాజ్ కు ఒక వికెట్ లభించింది. భారత్ ఇన్నింగ్స్ లో రోహిత్ 26 పరుగులు చేసి ఔటవ్వగా, శుభమన్ గిల్ సరిగ్గా 50 పరుగులు చేసి ఔటయ్యాడు.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/