అన్ని వర్గాల వారి సంక్షేమమే మా లక్ష్యం

ప్రతి పౌరుడు దేశభక్తిని పెంచుకోవాలి

cm jaga

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ ఇవాళ విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ శకటాలను సిఎం వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి పౌరుడు దేశభక్తిని పెంచుకోవాలని అన్నారు. రాజ్యాంగం, చట్ట ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. స్వాతంత్ర్యం అనేది ప్రాణవాయువు వంటిదని మహాత్మా గాంధీ చెప్పారని జగన్ గుర్తుచేశారు. సమాజంలో సమానత్వం అన్న పదాన్ని పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పుకొచ్చారు. ఏపి‌లో అన్ని వర్గాల వారి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

రైతు భరోసా, పెన్షన్ కానుక, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, కంటి వెలుగు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదాలకు అతీతంగా నవ రత్నాలు అందిస్తున్నామని చెప్పారు. 14 నెలలుగా గొప్ప సంకల్పంతో అడుగులు వేశామని తెలిపారు. మరో 1020 ఏళ్ల తర్వాత ఆంధ్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో విద్యలో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని తెలిపారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/