దేశంలో ద్రవ్య లభ్యత పెరుగుతుంది
ఆర్బిఐ చర్యలపై ప్రదాని మోది స్పందన
దిల్లీ: దేశంలో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్బిఐ రుణ చెల్లింపులపై 3నెలల మారటోరియం విధిస్తు చేసిన ప్రకటనపై ప్రధాని మోది స్పందించారు. కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించేందుకే ఆర్బిఐ ఇవాళ భారి చర్యలు తీసుకుందని తెలిపారు. ఆర్బిఐ చేసిన తాజా ప్రకటన వల్ల దేశంలో ద్రవ్య లభ్యత పెరగడమే కాకుండా, నిధులపై వ్యయం తగ్గుతుందని, తద్వారా వ్యాపార వర్గాలకు, మధ్య తరగతి ప్రజలకు, ఊతం లభిస్తుందని పేర్కోన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/