పెరిగిన సిప్స్, డిసెంబర్ నెలలో 14.20లక్షలు
2020 డిసెంబర్ నెలలో మెరుగైన పనితీరు
Mumbai: మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లు పెరిగాయి. 2020 డిసెంబర్ నెలలో ఈ రిజిస్ట్రేషన్లు 14.20 లక్షలకుపైగా పెరిగాయి.
సిప్స్ పెరుగుదలలో కొన్ని సాంకేతిక అంశాలు 2020 డిసెంబర్ నెలలో మెరుగైన పనితీరుకు దారితీశాయి. మ్యూచువల్ ఫండ్స్లో కొత్త సిప్ పెరుగుదలతో పాటు పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి.
2020 నవంబర్ నెలలో 10 లక్షల ఆరువేల సిప్స్ నమోదు కాగా, డిసెంబర్ నెలలో 14.20 లక్షలకుపైగా సిప్లు నమోదయ్యాయి. ఒక నెలలోనే సిప్లు 34శాతం మేర పెరిగాయి. అదే సమయంలో నిలిపి వేయపడిన సిప్స్ సంఖ్య నవంబర్ నెలలో 7.24లక్షలు కాగా, డిసెంబర్ నెలలో 7.76లక్షలకు పెరిగింది.
సిప్స్ పెరుగుద లతో మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు నవంబర్ నెలలో రూ.7302కోట్లు కాగా డిసెంబర్లో ఇది 8418 కోట్ల రూపాయలు. ఈక్విటీస్ మార్కెట్లో భారీ పెరుగుదల తర్వాత ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 2020 రెండో అర్థ సంవత్సరంలో ఈక్విటీ ఫండ్స్ నుంచి స్థిర ప్రవాహం చూసింది. 2020లో డీమ్యాట్ ఖాతాలు రికార్డుస్థాయిలో పెరిగాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/trump-youtube-channel-shutdown/