పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిఎం జగన్ శ్రీకారం
పశ్చిమగోదావరి: సిఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యాటనలో భాగంగా ఏలూరులో రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. పర్యటనలో భాగంగా సిఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/