ధోనికి జట్టులో స్థానం కష్టమే..
హర్షభోగ్లే సంచలన వాఖ్యలు
ముంబయి: కరోనా ఎఫెక్ట్తో ఇండియాలో జరగాల్సిన ఐపిఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ వాయిదా తో ధోని జట్టులోకి రావడానికి ఉన్న దారులు మూసుకుపోయాయని, క్రికెట్ కామెంటేటర్ హర్షభోగ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ధోని చిన్ననాటి కోచ్ రంజన్ బెనర్జి కూడా అన్నారు. భారత జట్టులో తిరిగి ధోని స్థానాన్ని దక్కించుకోవడం కష్టమని అన్నారు. కాని బిసిసిఐ ధోనికి చివరి అవకాశం ఇస్తుందని.. టీ20 వరల్డ్కప్ లో ధోని ఆడే అవకాశం ఉందని అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/