దేశంలో కొత్తగా 1,778 కరోనా కేసులు

తగ్గుతున్న యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 1,778 మందికి పాజిటివ్ గా తేలింది. తాజా కేసులతో కలిపి మొత్తంగా 4,30,12,749కి పెరిగాయి. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మరో 826 యాక్టివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 23,087 మంది ఇంకా కరోనాతో బాధపడుతున్నారు.

ఇప్పటిదాకా కరోనా బారి నుంచి 4,24,73,057 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.57గా ఉంది. మరో 62 మంది కరోనాకు బలవగా.. మొత్తం మరణాల సంఖ్య 5,16,605కి చేరింది. కాగా, డైలీ పాజిటివిటీ రేటు 0.26 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 0.36 శాతంగా నమోదైంది. ఇక, 184,03,90,980 డోసుల కరోనా వ్యాక్సిన్ ను వినియోగించారు. రాష్ట్రాల వద్ద ఇంకా 16,97,30,191 వ్యాక్సిన్ డోసులున్నాయి.

.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/