పాక్లో ప్రధానిపై ప్రతిపక్షాల ధ్వజం
కరాచి: పాకిస్థాన్లో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పాకిస్థాన్ డెమొక్రటిక్ అలయన్స్ పేరిట కూటమిగా ఏర్పడిన 11 విపక్ష పార్టీలు.. దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే కరాచీలో భారీ సభను నిర్వహించాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ఎంతో మంది నియంతలు చరిత్రలో కలిసిపోయారని, ఈ కీలుబొమ్మ సర్కార్ ఏం నిలబడగలదని ప్రశ్నించారు. తమది నిర్ణయాత్మక పోరు అని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ అసమర్థుడని, బుద్ధిహీనుడని అక్కడి ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/