చలువ చేసే జావ

రోగనిరోధక శక్తి

porridge
porridge

వేసవి కాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి.

ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో చేసే జావ. ఇది సులువుగా జీర్ణమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కావాల్సిన పోషకాలు అందిస్తుంది.

జావ అంటే ఏదో కొంచెం నీళ్లలో రాగిపిండి వేసుకుని తీసుకోవడం కాదు. బియ్యం, పెసలు, రాగులు, గోధుమలు, బార్లీ, సోయాగింజలు వీటన్నింటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి.

ఈ పొడిలో ఒకటికి నాలుగువంతుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయాలి. ఇందులో ఉడికించిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు.

కావాలనుకుంటే కాస్త నెయ్యి కూడా కలుపుకోవచ్చు. ఈ జావలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. దీని ద్వారా తక్షణ శక్తి అందుతుంది.

ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. దీంట్లో ఆమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే ట్రిప్టోపెన్‌ వల్ల కడుపు నించిన భావన కలుగుతుంది.

ఈ జావలో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్‌ బి, పీచు, మాంసకృత్తులు ఉంటాయి. 25 గ్రాముల పొడితో తయారుచేసిన జావను తీసుకున్నా కావాల్సిన శక్తి అందుతుంది.

రెండు గంటపాలు ఆకలి వేయదు. డైటింగ్‌లో భాగంగా రాత్రిపూట దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఈ జావ త్వరగా జీర్ణమవుతుంది.

దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి మంచి ఆహారం. అన్ని వయసుల వాల్లు, మధుమేహ బాధితులు దీన్ని తీసుకోవచ్చు. జావ కాస్త కారంగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/