ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతున్నారు
రాజధాని రైతులపై ప్రభుత్వం కక్ష కట్టింది
గుంటూరు: అమరావతి ఉద్యమకారులపై వైఎస్సార్సిపి నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని టిడిపి నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. అమరావతికి మద్దతుగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టిన రైతులకు టిడిపి నేతలు మాకినేని పెద్ద రత్తయ్య, ప్రత్తిపాటి పుల్లరావు, నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ..రాజధాని రైతులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పక్క మండలం తహసీల్దార్ను రాజధానికి పంపారని ఆరోపించారు. సర్వేను ప్రశ్నిస్తే 426 మందిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మీడియాపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఆయా గ్రామాల్లోనే స్థలాలు సేకరించాలని నక్కా ఆనందబాబు సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/