క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా
టిడిపి నేత వర్ల రామయ్య
అమరావతి: వైయస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పై టిడిపి నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిచారు. గతంలో కేంద్రానికి పంపిన లేఖ తనే రాశానని స్వయాన మాజి ఎస్ఈసి ఒప్పుకున్నా కూడా వినరా అంటు ప్రశ్నించారు. సిఐడి దర్యాప్తుల పేరుతో కోర్టులను పక్కదారి పట్టించేందుకు వైయస్ఆర్సిపి ప్రయత్నిస్తుందని అన్నారు.విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పక పోతే పరువునష్టం దావా వేస్తానని రామయ్య హెచ్చరించాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/