ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాల్సిందేః నందమూరి తారకరత్న

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది

Tarakaratna

అమరావతిః ఏపికి, టిడిపి చంద్రబాబు పాలన అవసరమని సినీ హీరో నందమూరి తారకరత్న అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తమ్ముడు అని, నందమూరి రక్తం ఆయనలో ఉందని చెప్పారు. సినీ కెరీర్ లో బిజీగా ఉన్న తారక్ అవసరమైనప్పడు రంగంలోకి దిగుతాడని అన్నారు. జూనియర్ ని పక్కన పెడుతున్నారంటూ అసత్య ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందని… దాన్ని నమ్మవద్దని చెప్పారు. నందమూరి, నారా కుటుంబాలు రెండూ ఒకటేనని అన్నారు. ఏపీ బాగు పడలంటే మామ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని చెప్పారు.

చంద్రబాబు, టిడిపిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కొడాలి నాని గురించి స్పందిస్తూ… ఈ విషయంపై మాట్లాడేంత సమయం కానీ, ఓపిక కానీ తనకు లేదని అన్నారు. వాళ్లకు మైకులు ఉన్నాయని కాబట్టి ఏదో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకునే పనిలో మాత్రమే తాము ఉన్నామని తెలిపారు. విమర్శిస్తున్న వారి మాటలకు స్పందించాల్సిన అవసరం కూడా లేదని, స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వారసులుగా తమను ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారని… ఇంతకంటే ఏమి కావాలని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని… రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న వీడియోను చూడండి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/