గణనాథుడిని ఎత్తుకున్న మోడీ..ఎక్కడో తెలుసా..?

గణేష్ నవరాత్రులు వచ్చాయంటే చాలు..వివిధ రూపాల్లో గణనాధులు భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇప్పటికే పుష్ప , ఆర్ఆర్ఆర్ వంటి రూపాల్లో ఆకట్టుకోగా..తాజాగా వరంగల్ లో గణనాథుడిని మోడీ ఎత్తుకున్నట్లు ఉన్న విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటుంది. వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఇలా వినూత్నంగా ఆలోచించారు. గణపతిని ఎత్తుకుని ఉన్న మోడీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ట్రెండ్ సెట్ చేసారు. బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకుంటాడు.

ఇక్కడ ఏర్పాటు చేసిన మోడీ విగ్రహం కూడా అచ్చం దానిలాగే ఉండటంతో భక్తులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు మోడీ గణపతి కి పూజలు చేస్తామని చెప్పారు. మట్టితో మోడీ విగ్రహాన్ని తయారు చేశామని, మోడీ విగ్రహాన్ని తయారు చేసే అవకాశం రావడం గొప్ప విషయమని తయారీదారుడు రాజేందర్ ఆనందం వ్యక్తం చేశాడు.