కరోనా మరణాల పరిగణనపై వివరాలు

ఐసీఎంఆర్‌ మార్గర్శకాలు విడుదల

ICMR issues guidance for appropriate recording of COVID-19 deaths

ముంబయి: కొవిడ్-19 న్యుమోనియా, రక్తం గడ్డకట్టడం, హార్ట్ అటాక్ వంటి లక్షణాలతో మరణించినప్పుడే దాన్నికొవిడ్-19గా పరిగణించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టత ఇచ్చింది. అంతేకాదు, మరికొన్ని సమయాల్లోనూ కరోనా మరణాల పరిగణనపై వివరాలు తెలిపింది. కరోనా టెస్టు ఫలితాలపై అనిశ్చితి ఏర్పడి, రోగిలో లక్షణాలు ఉంటే దాన్ని కొవిడ్-19 గా నమోదు చేయాలని, ఒకవేళ పరీక్ష ఫలితాలు ఆలస్యం అయిన పరిస్థితుల్లో… లక్షణాలు కనిపిస్తే కొవిడ్-19 అనుమానిత మృతి గా పరిగణించాలని తెలిపింది. అలాకాకుండా, కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినా, లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘క్లినికల్లీ ఎపిడెమిలాజికల్లీ కొవిడ్-19 గా భావించాలని సూచించింది. ఉబ్బసం, గుండెజబ్బులు, బ్రాంకైటిస్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు కరోనా మూలకారణాల కిందికి రావని, రోగుల్లో ఎన్ని లక్షణాలు ఉన్నా మూల కారణాలతో సంభవించిన మరణాలనే కొవిడ్-19 లుగా నమోదు చేయాలని వివరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/